YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ముఖ్యమంత్రి కెసిఆర్ కు కేరళ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు

ముఖ్యమంత్రి కెసిఆర్ కు  కేరళ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ మేరకు సిఎం కెసిఆర్ కు లేఖ రాశారు. కేరళలో వరదల దృష్ట్యా చేసిన సహాయానికి కేసీఆర్‌కు విజయన్ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం ప్రకటించిన రూ.25 కోట్ల రూపాయల చెక్కును ఆదివారం రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్వయంగా త్రివేండ్రం వెళ్లి కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌కు అందజేశారు. చిన్నారుల కోసం శనివారం వంద టన్నుల పౌష్టికాహారాన్ని పంపించిన ప్రభుత్వం, ఆదివారం పరిశుభ్రమైన నీటిని అందించడం కోసం రెండున్నర కోట్ల విలువైన యాభై ఆర్వో ప్లాంట్లను 20టన్నుల పాలపొడిని రక్షణశాఖ విమానంలో సహాయ సిబ్బందితోపాటు పంపించింది. కేరళకు తెలంగాణ ప్రభుత్వం రూ. 25కోట్ల ఆర్థిక సహాయంతో పాటు ఇతరత్రా సాయం చేసిన విషయం తెలిసిందే. 

Related Posts