రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో 33,534 మంది సిబ్బందికి గాను 19,852 మంది విధులకు హాజరు కావడం లేదని, వీరి గైర్హాజరును ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి తెలిపారు.తేది.22-08-2018 సాయంత్రం 5 గంటలలోగా హాజరు కాని సిబ్బంది వివరాలను ప్రత్యేక అధికారుల ద్వారా సేకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లను కోరారు. తేది. 23-8-2018 నుండి అన్ని గ్రామ పంచాయతీలలో హాజరుకాని సిబ్బందికి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రత్యేక అధికారులను ఆదేశించాలని జిల్లా కలెక్టర్లను సి.యస్ కోరారు.