గిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మంగళవార ఉదయం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పక్కన ఉన్న లోయలోకి జారిపోయింది. ఈ ఘటనలో పది మందికి పైగా మృతిచెందారు. పలువురు గాయపడ్డారు.
బస్సు లోతుగా ఉన్న ప్రాంతంలోకి పల్టీలు కొట్టడంతో ముందుభాగం ధ్వంసమయింది. ప్రమాదానికిగురయిన బస్సు కొండగట్టు నుంచి జగిత్యాలకు వెళుతుంది. ప్రమాద సమయంలో బస్సులో 65 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనాస్థలమంత భీబత్సంగా మారింది.. స్థానికులు క్షతగాత్రులను బయటికి తీశాఆ. గాయాపడినవారి ఆక్రంందనలతో ప్రమాదస్థలం దద్దరిల్లింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందని పోలీసులు అంటున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే జగిత్యాల కలెక్టర్, ఎస్పీలు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదం పట్ల కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు.. యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. ఘటన పై మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రాణనష్టం జరగడం పట్ల, పలువురు తీవ్రంగా గాయపడడం పట్ల మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, గాయపడిన వారికి వెంటనే సరైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి హుటాహుటిన కొండగట్టుకు బయలదేరివెళ్లారు.