సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల హబిసిపూర్ గ్రామంలో పెద్ద సంఖ్యలో తెరాస, తేదేపా కార్యకర్తలు కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టిపిసిసి ప్రధాన కార్యదర్శి పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన ఎంపిటిసి షాదుల్ స్వామి (వంశీ).అబ్బుల యాద గౌడ్ సమక్షంలో సుమారు వెయ్యి మందికి పైగా మహిళలు పెద్దలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గత ఎలక్షన్లో లో గెలిచిన ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మా గ్రామానికి చేసిందేమీ లేదని మా గ్రామాన్ని పట్టించుకున్న లేదని వారు ఆరోపించారు. ఉదైనా సమస్య పైన ఫోన్ చేస్తే స్పందన రాదని రాలేదని నేను తర్వాత చేస్తా బిజీ ఉన్నా అని చెప్పడం అయన అలవాటని వారన్నారు. విసుగు చెంది మా ఊరి గ్రామ ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ లోకి పార్టీలోకి చేరామని అన్నారు. అసలు తెరాస లో మాకు తగిన గుర్తింపు లేదని అన్నారు.