YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బాబుకు కన్నా మరో లేఖాస్త్రం

బాబుకు కన్నా మరో లేఖాస్త్రం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బుధవారం ఐదు ప్రశ్నలతో కూడిన లేఖాస్త్రం సంధించారు. భోగాపురం విమానాశ్రయం టెండర్ల రద్దుపై సీబీఐ విచారణకు సిద్ధమా అని చంద్రబాబును లేఖలో ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి ప్రతి వారం ఒక బహిరంగ లేఖను రాస్తున్న కన్నా బుధవారం తన 11వ లేఖను విడుదల చేశారు. భోగాపురం విమానాశ్రయం విషయంలో ఎయిర్‌పోర్ట్ అథారిటి ఆఫ్ ఇండియా మొదట నిర్వహించిన టెండర్ దక్కించుకుంటే దాన్ని ఎందుకు రద్దు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేవలం ప్రైవేటు సంస్థలకు లబ్ది చేకూర్చేందుకే వీటిని రద్దు చేశారని కన్నా ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను, అవినీతిని, అప్రజాస్వామిక వ్యవహారశలినీ ప్రశ్నిస్తూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రతీ వారము 5 ప్రశ్నలు సంధిస్తున్నారు11వ వారం ముఖ్యమంత్రి గారికి కన్నా లక్ష్మీనారాయణ గారు సంధించిన ప్రశ్నలు

Related Posts