YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కర్నూలు లో కాంగ్రెస్ ర్యాలీ

కర్నూలు లో కాంగ్రెస్ ర్యాలీ

రాఫెల్ కుంభకోణం దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని ఏపీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ రిలయన్స్తో కుమ్మకై ఒక్కొ యుద్ద విమానం మీద 1000 కోట్లకు పైగా రాబందుల్లా దోచుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ మాత్రం అనుభవం లేని రిలయన్స్కు కాంట్రాక్టులు ఇవ్వడంలో జరిగిన అవినీతిని ఎండగడతామన్నారు. రాఫెల్ కుంభకోణంలో దేశం ముందు బీజేపీని, మోడీ ప్రభుత్వాన్ని దొషిగా నిలపడమే కాంగ్రెస్ లక్ష్యం అని పిసిసి చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తో కలిసి కర్నూల్ లో భారీ ర్యాలీ నిర్వహించిన రఘువీరా అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు.

Related Posts