YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో నిఫ్ట్ అడుగులు...

ఏపీలో నిఫ్ట్ అడుగులు...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్)' ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు అమరావతిలో త్వరలోనే రూ.300 కోట్లతో 'నిఫ్ట్' నిర్మాణ పనులు ప్రారంభంకానున్నాయి. 'నిఫ్ట్‌' ఏర్పాటుకు కేటాయించనున్న స్థలాన్ని పరిశీలించేందుకు హైదరాబాద్ నుంచి సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ శివలింగం ఆధ్వర్యంలో ఓ బృందం బుధవారం  అమరావతిలో పర్యటించింది. 'నిఫ్ట్' స్థలాన్ని పరిశీలించిన బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. 

పరిశీలన అనంతరం చేనేత శాఖామాత్యులు అచ్చెంనాయుడు ఈ బృందం సమావేశమైంది. నిఫ్ట్ ఏర్పాటుకు సుమారుగా ౩౦ ఎకరాల స్థలం అవసరమవుతుందని, సంస్థ తరఫున కార్యాలయ ఏర్పాటుకు రూ.300 కోట్ల నిధులు కేటాయించినట్లు డైరెక్టర్ శివలింగం ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా మొత్తం 9 కోర్సులను విద్యార్థులకు అందించనున్నట్లు మంత్రికి శివలింగం తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు స్థల కేటాయింపుపై తాను ముఖ్యమంత్రితో మాట్లాడతానని బృందానికి హామీ ఇచ్చారు. 

Related Posts