YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రోజా వినూత్న ప్రదర్శన

రోజా వినూత్న ప్రదర్శన

చంద్రబాబు పాలనలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందంటున్నారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా. టీడీపీ అధికారంలోకి వచ్చాక రోడ్లు వేశామంటూ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని.. ఓసారి గ్రామాల్లోకి వచ్చి తిరిగితే పరిస్థితి ఏంటో తెలుస్తుందన్నారు. చిత్తూరు జిల్లా నగరి సమీపంలోని మేళపట్టులో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయంటూ రోజా వినూత్నంగా నిరసన తెలిపారు. స్థానిక మహిళలతో కలిసి రోడ్డుపై వరినాట్లు వేశారు. రోడ్లపై నీళ్లు నిలిచిపోయి.. నడవడానికి కూడా వీలు లేకుండా పోయిందని.. స్థానికులు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని రోజా మండిపడ్డారు. టీడీపీ జడ్పీటీసీ సొంత గ్రామంలోనే రోడ్ల పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్రంలో మిగిలిన రహదారుల పరిస్థితి ఏంటన్నారు. రాష్ట్రంలో లక్షల కిలోమీటర్లు రోడ్లు వేశామని గొప్పలు చెప్పుకుంటున్న మంత్రి లోకేష్.. దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఈ విషయాన్ని గ్రామస్థులు ఎన్నో సార్లు తన దృష్టికి తీసుకొచ్చారని.. రోడ్ల దుస్థితిపై ఎన్నోసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. రోడ్ల అధ్వాన్నంగా ఉండటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రోజా. 

Related Posts