YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నిమజ్జనంలో ఘర్షణ

 నిమజ్జనంలో ఘర్షణ
శ్రీకాకుళం జిల్లా లో జరిగిన వినాయకుని నిమజ్జనంలో ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాల మధ్య  కొట్లాట జరగడంలో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఘర్షణకు పాత కక్షలే కారణమని పోలీసులు అంటున్నారు. తాజాగా వినాయక నిమజ్జనం  కార్యక్రమంలో  తలెత్తిన ఘర్షణ  తీవ్ర ఉద్రిక్తత కు దారి తీసింది.  పలాస ఉదయం పురం గ్రామానికి చెందిన పొందూరు మురళి (22), రాజాం గంగాధర్  అనే యువకుల పై అదే గ్రామానికి చెందిన తోట లక్ష్మణరావు  కత్తితో  ఇద్దరు తలలపై నరికి తీవ్రంగా గాయపర్చాడు. ఈ క్రమంలో  తోట లక్ష్మణరావుకు కూడా గాయాలయ్యాయి. బాధితులను పలాస ప్రభుత్వాసుపత్రికి  చికిత్స నిమిత్తం  తరలించారు. 

Related Posts