YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఇవాళ నెల్లూరుకు పవన్

ఇవాళ నెల్లూరుకు పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్  నెల్లూరు టూర్ కు రెడీ అవుతున్నారు. ఎప్పటిలాగే ఎన్నికల ముందు హడావిడే ఇదంతా అని అందరూ అనుకుంటున్న టైంలో,  అజ్ఞాతం వీడి బయటకు రానున్నారు. దాదాపు 40 రోజుల తరువాత తనకి ఎంతో ఇష్టమైన హైదరాబాద్ వదిలి,ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. 23వ తేదీ ఉదయం బారాషాహిద్‌ దర్గాను దర్శించుకుని, 2019 ఎన్నికల్లో గెలుపొందేందుకు స్వర్ణాల చెరువులో తమ పార్టీ ముఖ్యనేతల ద్వారా ‘గెలుపు రొట్టె’ పట్టుకోనున్నారు. మరి ఇక్కడే పర్యటన కొనసాగుతుందా, లేకపోతే మళ్ళీ హైదరాబాద్ చెక్కేసి ఫార్మ్ హౌస్ కి వేల్లిపోతాడా అనేది తెలియాల్సి ఉంది. 40 రోజుల తరువాత బయటకు వస్తూ ఉండటంతో, పవన్ అభిమానులు కేరింతలు కొడుతున్నారు. ఇక మా అన్నే కాబోయే సియం అంటూ, హుషారుగా ఉన్నారు.

 

Related Posts