YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎవరికీ లేని సానుకూలత మనకు ఉంది: ప్రవాస ఆంధ్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు

ఎవరికీ లేని సానుకూలత మనకు ఉంది: ప్రవాస ఆంధ్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు

ఐటి ప్రతిభా పాఠవాలు మన సొంతం.అన్ని ప్రాంతాల వారు దీని ద్వారా అనుసంధానం కావాలి. ఏపిలో ఇంటింటికి రూ.149కే ఫోన్,కేబుల్,నెట్ ఇస్తున్నాం. 15ఎంబిపిఎస్ ఇంటర్నెట్ ఇస్తున్నాం.వర్ట్యువల్ క్లాస్ రూమ్ లు నిర్వహిస్తున్నాం. టవర్ కార్పోరేషన్ పెట్టాం. అన్ని గ్రామాలకు వైఫై ఉండేలా చూస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో అన్ని శాఖల సమాచారం మీ ముందు ఉంది. దానిని అధ్యయనం చేయాలి. సమస్యల పరిష్కారానికి వినూత్న  ఆలోచనలు చేయాలి. మీ విజ్ఞానం మీ గ్రామాభివృద్దికి దోహదపడాలి. ఒకే ఊరికి చెందిన వందమంది ఇక్కడికొచ్చిన ఉదంతాలు ఉన్నాయి. ఊరుఊరంతా అమెరికా వచ్చిన ప్రాంతాలు ఉన్నాయి. త్వరలోనే ఎన్నారై టిడిపి సర్వీస్ సెంటర్ పెడతాం. మీరు చేసే సేవా కార్యక్రమాలకు మార్గదర్శకం చేస్తాం. ప్రజా సేవ చేస్తామంటే అవకాశాలు ఇస్తామని అన్నారు. సేవా భావం ఉన్నవారందరికీ సరైన వేదిక తెలుగుదేశం పార్టీ. అక్టోబర్ లోపు మీ ఓటు ఎన్యూమరేట్ చేసుకోవాలి. ఎన్నారైల ఓటుహక్కు బిల్లు లోక్ సభ ఆమోదం పొందింది. రాజ్యసభలో త్వరలో రానుంది. అది ఆమోదం పొందేసరికి మీరంతా సన్నద్ధంగా ఉండాలని సూచించారు. వయబిలిటి లేకపోతే సస్టయినబిలిటీ రాదు. సస్టయినబిలిటీ రాగానే ఛారిటీ పెరగాలి. బిల్ గేట్స్, వార్న్ బఫెట్, జాన్ బుకెర్ బర్గ్ తదితరుల సేవాభావం స్ఫూర్తిదాయకం కావాలి. ఎక్కడికెళ్లినా‘ మళ్లీ నువ్వే రావాలి’ అని అందరూ కోరుతున్నారు. నీవల్లే మేము ఇక్కడ ఉన్నాం. మళ్లీ నువ్వే రావాలి అంటున్నారు. మీ అందరి అభిమానం పొందడం నా అదృష్టం అని అయన అన్నారు.

Related Posts