వనపర్తి జిల్లాలో ఆపదర్మ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ సోమవారం సుడిగాలి పర్యటన జరిపారు. మొదట ఖిల్లా ఘనపూర్ కు చేరుకోగ ప్రణాలిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి భారి ఎత్తున బైకు ర్యాలీ తో స్వాగతం పలికారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి, నిరంజన్ రెడ్డి తో కలిసి ఖిల్లా ఘనపూర్ లో రై 25 లక్షల తో నిర్మిస్తున్న షాదీఖానా, రూ 25 లక్షల తో నిర్మిస్తున్న అంబేద్కర్ భవన్ కు శంకుస్థాపన చేశారు. మండల ప్రజలతో అక్కడ వున్న సమస్యల పై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెరాస నాయకులు, కార్యకర్తలు,మండల ప్రజలు పాల్గొన్నారు.