YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జగ్గారెడ్డికి బెయిల్ మంజూరు

జగ్గారెడ్డికి బెయిల్ మంజూరు
మానవ అక్రమ రవాణా కేసులో అరెస్టైన తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డికి బెయిల్ మంజూరయ్యింది. సోమవారం బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన సికింద్రాబాద్ సిటీ కోర్టు.. షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. రూ.50వేల చొప్పున రెండు పూచీకత్తు.. ప్రతి ఆదివారం మార్కెట్‌ పోలీస్‌స్టేషన్‌లో హాజరు కావాలని షరతు విధించారు. సాయంత్రం ఆయన చంచల్‌గూడ జైలు నుంచి విడుదలకానున్నారు. జగ్గారెడ్డికి బెయిల్ మంజూరు కావడంతో సంగారెడ్డిలో అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. 2004లో నకిలీ పత్రాలు, పాస్‌పోర్ట్‌తో మానవ అక్రమ రవాణా చేసినట్లు జగ్గారెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఆగస్ణు 6న ఆయన్ను పఠాన్ చెరులో పోలీసులు అరెస్ట్ చేశారు. జగ్గారెడ్డిపై ఎనిమిది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అరెస్టైన వెంటనే బెయిల్‌ కోసం సికింద్రాబాద్ కోర్టులో పిటిషన్ వేసినా తిరస్కరించారు. ఆయనకు రెండు వారాల రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు. తర్వాత మూడు రోజుల పాటూ పోలీసుల కస్టడీకి అప్పగించారు. మళ్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. బెయిల్ మంజూరయ్యింది. 

Related Posts