YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణలో దొరల పాలన కొనసాగుతోంది.. కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన కొండా సురేఖ

తెలంగాణలో దొరల పాలన కొనసాగుతోంది..  కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన కొండా సురేఖ

తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన కొనసాగుతోందని కొండా సురేఖ ఆరోపించారు. మంగళవారం సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ విడుదల చేశారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తనకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం దారుణమన్నారు. ఒక్క మహిళా మంత్రి కూడా లేకుండా ప్రభుత్వాన్ని నడపడంలోనే మహిళలపై కేసీఆర్‌కు ఉన్న గౌరవం ఏంటో తెలుస్తోందన్నారు.తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారికి తెరాసలో సరైన ప్రాధాన్యత లభించడం లేదని ఆక్షేపించారు. బీసీ మహిళ అయిన తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోయినా పార్టీ కోసం ఎంతో చేశానని.. అయినప్పటికీ తనకు ఎమ్మెల్యే సీటు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘తెరాస ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. కేంద్రంతో పాటుగా ఎన్నికలు జరిగితే ఓడిపోతామని కేసీఆర్‌కు భయం పట్టుకుంది. అందుకే ‌ ముందస్తు ఎన్నికలకు తెరదీశారు. కేసీఆర్‌ ఒక్కరోజు కూడా సచివాలయానికి రాని ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచారు. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్‌.. ఆయన కుటుంబానికి మాత్రం నాలుగు పదవులు ఇచ్చుకున్నారు. ముఖ్యమంత్రిని కలవాలంటే సాధారణ ప్రజలకే కాదు ప్రజాప్రతినిధులకూ కష్టమే. సీఎం అపాయింట్‌మెంట్‌ కోసం ఎప్పుడు ప్రయత్నించినా నిరాశే ఎదురవుతోంది. నా తండ్రి చనిపోతే ఓదార్చడానికి రాని కేసీఆర్‌... తెదేపా నుంచి వచ్చిన ఎర్రబెల్లి దయాకర్‌రావు తండ్రి చనిపోతే మాత్రం వరంగల్‌ వచ్చి పరామర్శించి వెళ్లారు. బీసీ మహిళను కాబట్టే నాపై వివక్ష చూపుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి పదవులు ఇచ్చేందుకు ఆలోచిస్తున్న కేసీఆర్‌.. తనకు మందుబిళ్లలు సమయానికి ఇచ్చేందుకు నియమించుకున్న వ్యక్తిని మాత్రం ఏకంగా రాజ్యసభకు పంపారు. బంగారు తెలంగాణ అర్థం ఇదేనా?. రైతుబంధు పథకంతో ధనిక రైతులకు తప్ప పేద రైతులకు ఎలాంటి ప్రయోజనం దక్కడం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత సోనియాగాంధీని కలిసి కాళ్లు మొక్కిన కేసీఆర్‌.. ఇప్పుడు ఆమె దెయ్యమంటూ అవహేళన చేయడం దారుణం. నిరుపేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. రాష్ట్రపతి హోదాలో హైదరాబాద్‌కు వచ్చిన ప్రణబ్‌ముఖర్జీ కాళ్లు మొక్కిన కేసీఆర్‌... ఇప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను మాత్రం పట్టించుకోలేదు. దళితుడైనందు వల్లే ఆయన్ని కేసీఆర్‌ అవమానించారు. తెరాస ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితాలో నా పేరు లేకపోవడం బాధించింది. దీనిపై రెండ్రోజుల్లో నాకు సమాధానం చెప్పాలని అధిష్ఠానాన్ని కోరా. పది రోజులైనా వారి నుంచి సమాధానం రాలేదు. అందుకే కేసీఆర్‌ బహిరంగ లేఖ రాస్తున్నానన్నారు.తన వారసుడైన కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టేందుకు కేసీఆర్‌ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అందుకే హరీశ్‌రావు నమ్మకస్తులకు టిక్కెట్లు కేటాయించలేదు. ఎన్నికల సమయంలో అమెరికా నుంచి వచ్చిన కవిత నెల రోజులు ఉండి వెళ్లిపోతానని చెప్పి వ్యాపారిగా మారింది. లష్కర్‌ బోనాల్లో కవిత ఏ ప్రొటోకాల్‌ ప్రకారం బంగారు బోనం ఎత్తుకుంది. అదేనా బంగారు తెలంగాణ అంటే?. నయీం కేసు ఏమైందో ప్రభుత్వం చెప్పాలి. ఎర్రబెల్లి దయాకర్‌రావు అల్లుడు కాంగ్రెస్‌లో ఉంటే తప్పలేదు గానీ.. డీఎస్‌ కుమారుడు భాజపాలో చేరితే విమర్శిస్తారా?. ఎర్రబెల్లికి ఓ న్యాయం.. డీఎస్‌కు ఓ న్యాయమా?. వచ్చే ఎన్నికల్లో తెరాస అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించిన కేటీఆర్‌ అందుకు సిద్దం కావాలి. వచ్చే ఎన్నికల్లో మహాకూటమి చేతిలో తెరాస ఓటమి ఖాయం.మా కుటుంబానికి చేసిన నమ్మకద్రోహాన్ని ప్రజలకు తెలియజెప్పేందుకే మీడియా ముందుకు వచ్చాను. పార్టీలో హరీశ్‌రావుకు కూడా అన్యాయం జరుగుతోంది. అందుకే ఇటీవల ఆయన రాజకీయాలను నుంచి తప్పుకుంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు. నాకు చాలా పార్టీల నుంచి ఆహ్వానాలు వస్తున్నాయి. అయితే తెరాస అధిష్ఠానం మాపై ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూసిన తర్వాతే మా భవిష్యత్‌ నిర్ణయం ప్రకటిస్తాం నను కొండ సురేఖ తెలిపారు.

Related Posts