కొండా సురేఖ దంపతులపై వరంగల్ టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. కొండా దంపతుల బహిరంగ లేఖ తప్పుల తడక. కేసీఆర్ ని విమర్శించే నైతిక హక్కు లేదని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, తాజా మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి విమర్శించారు. మంగళవారం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజకీయ పునర్జజన్మనిచ్చిన కేసీఆర్ ని విమర్శించడం అంటే తిన్నింటి వాసాలు లెక్కించడమేనని వారన్నారు. కొండా దంపతులు వాస్తవాలు వక్రీకరిస్తున్నారని ఆరోపించారు.