YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

శ్రీవారి నవరాత్రి బ్రహ్మూత్సవాలలో దాతలకు కల్పించే ప్రత్యేక దర్శనాలు, గదుల కేటాయింపు రద్దు

శ్రీవారి నవరాత్రి బ్రహ్మూత్సవాలలో  దాతలకు కల్పించే ప్రత్యేక దర్శనాలు, గదుల కేటాయింపు రద్దు

శ్రీవారి నవరాత్రి బ్రహ్మూత్సవాల నేపథ్యంలో అక్టోబరు 8 నుండి 20వ తేదీ వరకు  టిటిడిలోని వివిద ట్రస్టులకు, స్కీమ్లకు డోనేషన్ అందించిన దాతలకు కల్పించే ప్రత్యేక దర్శనాలు, వారికి కేటాయించే గదులను టిటిడి రద్దు చేసింది.  శ్రీవారి నవరాత్రి బ్రహ్మూత్సవాలలో స్వామివారి వాహనసేవలు వీక్షించేందుకు సామాన్య భక్తులు సాధారణం కంటే అధికంగా విచ్చేస్తారు. కావున వారికి సంతృప్తికరంగా దర్శనం, వసతి కల్పించేందుకు నవరాత్రిబ్రహ్మూత్సవాలలో దాతలకు కల్పించే బ్రేక్ దర్శనాలు, సుపథం గుండా కల్పించే ప్రత్యేక దర్శనాలను టిటిడి రద్దు చేసింది. అదేవిధంగా అక్టోబరు 9న (అంకురార్పణం) నుండి 18వ తేదీ వరకు ప్రతి రోజు వయోవృద్దులు, దివ్యాంగులు, సం||లోపు చిన్న పిల్లల తల్లిదండ్రులకు కల్పిస్తున్న ప్రత్యేక దర్శనాలను టిటిడి రద్దు చేసింది. భక్తులు, దాతలు ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించాలని కోరుతున్నది.

Related Posts