YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రేవంత్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

రేవంత్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

మూడేళ్ల కిందట తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ‘ఓటుకు నోటు కేసు’పై తెలంగాణ ఆపద్ధర్మ ప్రభుత్వం మళ్లీ దృష్టిసారించింది. కేసు దర్యాప్తులో భాగంగా ఓటుకు నోటు కేసు నిందితుల ఇళ్లు, ఆస్తులపై ఆదాయ పన్నుశాఖ అధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలు ముమ్మరం చేశాయి. ఆ కేసులో ఏ1 ప్రస్తుత టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి కాగా, ఏ2గా సెబాస్టియన్‌ ఉన్నారు. ఓటుకు కోట్లు కేసు నిందితులు సెబాస్టియన్‌, ఉదయ్ సింహలకు ఐటీ యాక్ట్ ప్రకారం అధికారులు నోటీసులు జారీ చేశారు. మరోవైపు గురువారం ఉదయం ప్రారంభమైన తనిఖీలు శుక్రవారం సైతం కొనసాగుతున్నాయి. నిందితుడు సెబాస్టియన్‌ను వచ్చే నెల (అక్టోబర్‌ ) ఒకటో తేదీలోగా బషీర్‌బాగ్‌లోని ఆయకార్‌ భవన్‌లో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసులలో సూచించారు. హాజరు కాని పక్షంలో సెక్షన్ 271ఏ ఆదాయపు పన్ను చట్టం కింద జరిమానా విధించడంతో పాటు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కాగా, ఉదయ్‌ సింహా ఇంట్లో గురువారం ప్రారంభమైన ఐటీ, ఈడీ ఆకస్మిక తనిఖీలు శుక్రవారం కొనసాగుతున్నాయి. ఓటుకు కోట్లు కేసును తీవ్రంగా పరిగణిస్తున్న తెలంగాణ ఆపద్ధర్మ ప్రభుత్వం.. ఉదయ్‌ సింహా ఆస్తులతో పాటు ఆయన బంధువులకు సంబంధించిన ఇళ్లు, కంపెనీలలో తనిఖీలు జరిగాయి. మూడేళ్ల కిందట తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు 50 లక్షల నగదు ఇస్తూ అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ పట్టుబడ్డ విషయం తెలిసిందే. అయితే ఆ 50 లక్షల నగదుతో పాటు స్టీఫెన్‌సన్‌కు తమ డీల్‌లో భాగంగా ఇవ్వనున్న డబ్బును ఎక్కడ నుంచి తీసుకొచ్చరన్న దానిపై అధికారులు ఉదయ్‌ సింహాను ప్రశ్నించినట్లు సమాచారం. ఆదాయ వివరాలను వెల్లడించకపోవడం, ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న కారణంగా ఉదయ్ సింహాకు సెక్షన్‌ 131 ఆదాయపన్ను చట్టం-1961 ప్రకారం నోటీసులిచ్చారు. అక్టోబర్‌ 1న విచారణకు సిద్దంగా ఉండాలని ఆ నోటీసులో పేర్నొన్నారు.

Related Posts