YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నన్ను వాడుకుంటే..12సీట్లు ఇస్తా! సిఎం కెసిఆర్ కు మోత్కుపల్లి ఆఫర్

 నన్ను వాడుకుంటే..12సీట్లు ఇస్తా!     సిఎం కెసిఆర్ కు మోత్కుపల్లి  ఆఫర్

కేసీఆర్‌ మిత్రుడు.. ఎన్నికల్లో తనను వాడుకుంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 సీట్లు గెలిపించి చేతిలో పెడుతానని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు పేర్కొన్నారు. చంద్రబాబును నమ్మకుంటే మోసం చేశాడన్నారు. పార్టీలో తాను కేసీఆర్‌ కోసమే మాట్లాడానని, ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు వద్దని చెప్పానని పేర్కొన్నారు.  అప్పుడు రాజకీయంగానే టీఆర్‌ఎ్‌సను వ్యతిరేకించానే తప్ప.. తాను కేసీఆర్‌కు వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. టీడీపీ తెలంగాణలో ఉనికి కోల్పోయిందని.. అందరికి ఇచ్చేపార్టీగా చరిత్రగలది ప్రస్తుతం అడుక్కునే పార్టీగా మారిందని విమర్శించారు. ఇందుకు చంద్రబాబే కారణమని ఆయనపై తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తారు. తనకు ఎమ్మెల్యే పదవి కొత్త కాదని, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, తనను ఆదరించి న ఆలేరు ప్రజలకు గోదావరి జలాలు, రిజర్వాయర్ల సాధనకే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నానని నర్సింహులు పేర్కొన్నారు. గురువారం ఆయన యాదగిరిగుట్టలో నిర్వహించిన శంఖారావ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. తాను ఎన్టీఆర్‌ ఆశీస్సులతో మంత్రినయ్యానని, కానీ చంద్రబాబు వంటి మోసకారిని నమ్ముకుని నష్టపోయి నడిరోడ్డున నిలబడ్డానని పేర్కొన్నారు.తాను వ్యాపారిని కాదు.. రియల్‌ఎస్టేట్‌ దళారిని కాదు.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ప్రజాసేవ, నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేశానని గుర్తుచేశారు. నియోజకవర్గం పక్కనేగల తపా్‌సపల్లి నీళ్లు దిగువకు కాదని, ఎగువకు తీసుకుపోతుంటే అడిగే నాధుడు లేక ప్రజలు తీవ్ర అన్యాయానికి గురయ్యారన్నారు. తానైతే ఆ విధంగా నీళ్లను తరలించుకు పోనిచ్చేవాడినా అని ప్రశ్నించారు. యాదాద్రి జిల్లా సాధనకు పోరాడి కేసీఆర్‌ను ఒప్పించానన్నారు. ఈసారి ఎన్నికల్లో మీ కోసం పనిచేసే వారికే ఓటు వేయాలని సూచించారు. ఆలేరు ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచి గోదావరి జలాలు తీసుకొస్తానన్నారు. జనగామలో కలిసిన గుండాలని తిరిగి యాదాద్రి జిల్లాలో విలీనం చేపిస్తానని హామీనిచ్చారు.సభలో భార్య డాక్టర్‌ యశోదతో పాటు కూతురు,  అల్లుడు. మనమడిని ప్రజలకు పరిచయం చేశారు. అంతకుముందు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ఆయన మద్దతుదారులతో భారీ ర్యాలీ నిర్వహించారు.

Related Posts