YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కామదాహానికి బలైన బాలిక తల్లిదండ్రుల రూ.5లక్షల సాయం

కామదాహానికి బలైన బాలిక తల్లిదండ్రుల రూ.5లక్షల సాయం

అభం శుభం తెలియనివయసులో కామాంధుడి కబంధ హస్తాల్లో చిక్కుకుని ప్రాణాలు పోగొట్టుకున్నఓపసికందుతల్లిదండ్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదుకున్నారు. నాలుగేళ్ల వయసులోనే ఓ దుర్మార్గుడి కామదాహానికి బలైన బాలిక తల్లిదండ్రుల దుస్థితిని ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి  ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళారు. దాంతో చలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మానవతా దృక్పథంతో స్పందించారు. బాలిక తల్లిదండ్రులకు రూ.5 లక్షల ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. ఆమేరకు చెక్కును ఉండవల్లిలోని ప్రజావేదికలో బాలిక తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అందించారు. గుంటూరు జిల్లా మాచర్ల మండలంలోని కొత్తూరు గ్రామపరిధిలో గత మార్చిలో అంగన్ వాడిపాటశాలకువెళ్ళివస్తున్న సమయంలో చాక్లెట్ ఇచ్చిమాయమాటలు చెప్పి నాలుగేళ్ల వయసు బాలికనుపొలాల్లోకి తీసుకెళ్ళి కేతావాట్నాయక్ అత్యాచారం చేశాడు. తదుపరినిర్దాక్షిణ్యముగాఆ బాలికను చంపి తుప్పల్లో పడేశాడు. ఈవిషయం తెలిసి నన్నపనేని రాజకుమారి  ఆ గ్రామానికి వెళ్లి బాలిక తల్లిదండ్రులను పరామర్శించారు.ఆతల్లిదండ్రుల ధైన్యస్థితినితెలుసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. వారికి ఆర్ధిక సాయం చేయాలన్ననన్నపనేనివిజ్ఞప్తిని మన్నించినముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.అంజయ్య, గంగలను ముఖ్యమంత్రి వద్దకు నన్నపనేని,మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి కె. చలమారెడ్డిలుతీసుకువచ్చారు.
ఆమేరకు సిద్ధం చేసినరూ. 5లక్షల చెక్కును ముఖ్యమంత్రి ఆ బాలిక తలిదండ్రులకు అందజేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు దయార్థ హృదయానికిఅంజయ్య, గంగలు మన: పూర్వక  కృతజ్ఞతలు తెలిపారు

Related Posts