YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

కాంగ్రెస్ వల్లే దేశ, రాష్ట్రాభివృద్ధి సాధ్యం..

కాంగ్రెస్ వల్లే దేశ, రాష్ట్రాభివృద్ధి సాధ్యం..

- కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అనితర సాధ్యంగా కృషి

- మధిర కోసం కలలు కందాం..వాటిని నిజ చేద్దాం

- భట్టి విక్రమార్క పిలుపు

మధిర అభివృద్ధికి కలలు కందామ్.. వాటిని నిజ చేసుకుందాం అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.భట్టి నాయకత్వం, అభివృద్ధి నచ్చి స్థానిక బంజారా కాలనీకి చెందిన 50 కుటుంబాలు భట్టి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ వల్లే దేశ, రాష్ట్రాభివృద్ధి సాధ్యమని చెప్పారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వం ఈ దేశానికి చాలా అవసరం అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కుటుంబ పాలనకు చిరునామాగా మరీనా టీఆర్ స్ పాలనకు చరమగీతం పాడాలని  స్పష్టం చేశారు.
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు భట్టి విక్రమార్క అనితర సాధ్యంగా కృషి చేస్తున్నారు. నియోజక వర్గ అభివృద్ధి కోసం భట్టి చేస్తున్న కృషి.. అనితర సాధ్యం అని ప్రజలు చెబుతున్నారు. భట్టి నాయకత్వం, అభివృద్ధి నచ్చి స్థానిక బంజారా కాలనీకి చెందిన 50 కుటుంబాలు భట్టి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరాయి. గతంలో ఈ కుటుంబాలు.. సీపీఎం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించాయి. సీపీఎం కన్నా.. భట్టితోనే నియోజకవర్గం, రాష్ట్రం అభివృద్ధి చెందుతాయని ఈ సంధర్భంగా వారు చెప్పారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు భట్టికి ఎంతగానో రుణపడి ఉంటారని వారు చెప్పారు.
మధిర నియోజకవర్గం భట్టి వల్లే అంతోఇంతో అభివృద్ధి సాధించిందని సీపీఎం నుంచి కాంగ్రెస్ లో చేరిన కార్యకర్తలు తెలిపారు. భట్టి ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నట్లు.. వారు చెప్పారు.
ఈ సందర్భంగా...భట్టి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వల్లే దేశ, రాష్ట్రాభివృద్ధి సాధ్యమని చెప్పారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వం ఈ దేశానికి చాలా అవసరం అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కుటుంబ పాలనకు చిరునామాగా మరీనా టీఆర్ స్ పాలనకు చరమగీతం పాడాలని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
 

Related Posts