YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైసీపీలో ముసలం

వైసీపీలో ముసలం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మరో నియోజకవర్గంలో టికెట్ పోరు మొదలైంది. పాత ఇన్ చార్జికి, కొత్త ఇన్ చార్జికి మధ్యన టికెట్ వార్ షురూ అయ్యింది. ఈ మధ్య కాలంలోనే నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పులతో కొన్ని నియోజకవర్గాలో ఇలాంటి రచ్చలు రాజుకోగా.. ఇప్పుడు ఈ జాబితాలో చేరింది గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జిగా ఏసురత్నంను నియమించారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇటీవలే ఏసురత్నం వైకాపాలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయనను గుంటూరు వెస్ట్ నుంచి అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఈ ప్రకటన ఇప్పటి వరకూ ఆ నియోజకవర్గం ఇన్ చార్జిగా ఉండిన లేళ్ల అప్పిరెడ్డికి ఇబ్బందికరంగా మారింది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు అప్పిరెడ్డి. అయితే టీడీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చేతిలో అప్పిరెడ్డి చిత్తయ్యారు. మోదుగులకు భారీ మెజారిటీ దక్కింది. ఎన్నికల అనంతరం కూడా లేళ్ల ఈ నియోజకవర్గం ఇన్ చార్జిగా కొనసాగారు. అయితే ఇప్పుడు జగన్ మార్పు చేశారు. ఈ నేపథ్యంలో లేళ్ల తన అనుచరగణంతో తన ఆఫీసులో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఆయన అనుచరగణం మాట్లాడుతూ.. ప్రాధాన్యత దక్కని చోట ఉండవద్దని, రాజీనామా చేయాలని కోరారట. అయితే లేళ్ల మాత్రం ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. ప్రస్తుతం ఆయన అధినేత జగన్ మోహన్ రెడ్డితో సంప్రదింపులు జరిపే ప్రయత్నం చేస్తున్నాడని సమాచారం. 

Related Posts