YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

భారీగా పెరిగిన విజయ్ మార్కెట్

భారీగా పెరిగిన విజయ్ మార్కెట్
విజయ్ దేవరకొండ.. దక్షిణాది సినిమాలో ఇప్పుడొక సెన్సేషన్. కేవలం తెలుగులోనే కాదు తమిళం, మలయాళం, కన్నడ ఇలా ప్రతి సినిమా పరిశ్రమలోనూ విజయ్ అంటే ఓ ఆసక్తి పెరిగిపోయింది. ఇప్పటి వరకు తెలుగుకే పరిమితమైన విజయ్.. ఇప్పుడు ‘నోటా’ సినిమాతో తమిళ ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే తెలుగు, తమిళ రాష్ట్రాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విజయ్ స్వయంగా తమిళంలో డబ్బింగ్ చెప్పడంతో అక్కడ ఈ చిత్రంపై మరింత ఆసక్తి ఏర్పడింది. ఇప్పటికే అక్కడ ప్రచార కార్యక్రమాలు భారీగా నిర్వహించారు. అక్టోబర్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. చిత్ర విడుదల తేదీ దగ్గర పడటంతో తెలుగులోనూ ప్రచార కార్యక్రమాల జోరు పెంచారు. దీనిలో భాగంగా ఆదివారం రాత్రి విజయవాడలో ‘నోటా పబ్లిక్ మీట్’ పేరిట ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మెహ్రీన్, దర్శకుడు ఆనంద్ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయిన సంగతి తనకు గుర్తుండదని అన్నారు. విజయవాడలో తనకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూసి విజయ్ ఉప్పొంగిపోయారు. తన స్టైల్లో ఒక ‘ఉమ్మా’ ఇచ్చేశారు. ‘తెలుగు రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా అయ్యిందని నాకు గుర్తుండదు. మీకు గుర్తుంటదా? అంటే ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో చేస్తున్నానని.. రెండు రాష్ట్రాలకు ఒకే రౌడీ, ఒకే లీడర్, ఒకే చీఫ్ మినిస్టర్ అని ట్వీట్ చేశాను. కింద అందరూ రెండు రాష్ట్రాలేంటి.. మూడు రాష్ట్రాలు కదా? తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ అని పెట్టారు. అయ్యబాబోయ్ మనవి రెండు రాష్ట్రాలు కదా అని గుర్తొచ్చింది. ఇప్పుడు పుట్టిన తరానికి గుర్తుంటుందేమో ఇవి రెండు రాష్ట్రాలని, కానీ మన తరానికి ఇది ఎప్పుటికీ ఒక్క రాష్ట్రంగానే ఉంటుంది’ అని విజయ్ చెప్పుకొచ్చారు. 

Related Posts