Highlights
అహింస పద్దతిలో దేశానికి స్వాతంత్య్రం తెచ్చారు గాంధీజీ. అదే పద్దతిలో తెలంగాణ రాష్ట్రానికి స్వాత్రంత్రం తెచ్చారు కేసీఆర్. గ్రామాలు అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధిలోకి వస్తుంది..ఆ దిశలో కేసీఆర్ ముందడుగు వేస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. మంగళవారం నాడు గాంధీ జయంతి సందర్బంగా సిద్దిపేట ప్రశాంత్ నగర్ కాలనీలో మంత్రి గాంధీ విగ్రహ ఆవిష్కరణ చేసారు. మంత్రి మాట్లాడుతూ గాంధీజీ నాకెందుకు అనుకుంటే ఈ రోజు దేశానికి స్వాతంత్య్రం వచ్చేదే కాదు. అందరూ కూడా గాంధీజీ బాటలో నడుస్తే మన గ్రామ, పట్టణ, రాష్ట్ర, దేశాల్లో అభివృద్ధి పదంలోకి వెళుతుంది. సామాజిక బాధ్యత పెంపుకు ఉపాధ్యాయులు తోడ్పడాలి. అభివృద్ధికై మనందరం ఏకైమై ముందుకు సాగుదామని అన్నారు. గాంధీ జయంతి రోజు నూతన గాంధీ విగ్రహాన్ని అవిష్కరించుకున్నందుకు సంతోషమని అన్నారు.