YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

దివిసీమ ప్రాంతంలో టిటిడి కళ్యాణ మండపాలు అభివృద్ధి చేయాలి..!!

దివిసీమ ప్రాంతంలో టిటిడి కళ్యాణ మండపాలు అభివృద్ధి చేయాలి..!!

 దివిసీమ ప్రాంతంలో టిటిడి కళ్యాణ మండపాలు కోడూరు, నాగాయలంక, అవనిగడ్డ, మోపిదేవి లలో ఉన్నాయి. మోపిదేవి కళ్యాణ మండపం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి బదలాయించారు. పైన కళ్యాణ మండపాలు చాలా పాడైపోయి ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నాయి. పెచ్చులు ఊడిపోయి, వాటర్ పైప్లైన్ పనిచేయకుండా కరెంటు వైర్లు వేలాడుతూ, చుట్టూ ప్రహరీ కూడా అక్కడక్కడ విరిగిపోవటం వలన పందులు ఇతర జంతువులు సంచరిస్తూ ఉంటాయి.
ఇక్కడ ఈ ప్రాంతంలోని బీద వారే కాకుండా చాలామంది తమ బిడ్డలకు పెళ్లి చేసుకోవడానికి ఆనందంగా వస్తూ ఉంటారు. కానీ పరిసరప్రాంతాలు భవన పరిస్థితి చూసిన తర్వాత బాధపడుతూ ఇబ్బందిపడుతూ వారి కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు.

A) అవనిగడ్డ టిటిడి కళ్యాణ మండపం అభివృద్ధికి 37 లక్షలు ఎస్టిమేట్

బీ) కోడూరు కళ్యాణ మండపం మైంటెనెన్సు  కు ఎనిమిది లక్షలు

C) నాగాయలంక కళ్యాణ మండపం అభివృద్ధి గురించి 87 లక్షల ఎస్టిమేట్ వేయడం జరిగింది.
 అధికారులతో మాట్లాడి ఈ మూడు కల్యాణ మండపాలను అభివృద్ధి చేయవలసిందిగా ఆ ప్రాంతం వారందరూ కోరుతున్నారు.

 

 

Related Posts