YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్‌పై దాడిని ఖండిస్తూ శ్రీరెడ్డి ట్వీట్.. బుర్ర లేదా అంటూ నెటిజన్లు ఫైర్

జగన్‌పై దాడిని ఖండిస్తూ శ్రీరెడ్డి ట్వీట్.. బుర్ర లేదా అంటూ నెటిజన్లు ఫైర్
వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన దాడి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఏకంగా ప్రతిపక్ష నేతపై దాడి జరగడంతో.. రాజకీయ నేతలు, ప్రముఖులు జగన్‌పై దాడిని ఖండిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు కూడా చేస్తున్నారు. తాజాగా సినీ నటి శ్రీరెడ్డి కూడా జగన్‌పై జరిగిన దాడి ఘటనపై ట్విట్టర్‌లో స్పందించారు. ఈ దాడిని ఖండిస్తూ ఓ ట్వీట్ చేశారు. పాపం తన సానుభూతి తెలియజేయాలనుకుంటే.. ఆ ట్వీట్ కాస్త మిస్ ఫైర్ కావడంతో.. నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. 
శ్రీరెడ్డి తన ట్వీట్‌లో.. ‘మా జగన్ అన్నకి ఏం అయ్యింది, రాష్ట్రంకోసం తన జీవితాన్ని పణంగా పెట్టి అహర్నిశలు శ్రమిస్తున్న వై ఎస్ జగన్ గారి మీద ప్రతిపక్షాల దాడులు ఏంటి, దమ్ముంటే దైర్యంగా ఎదుర్కోవాలి అంతేగాని జనం కోసం పోరాడుతున్న జగన్ గారి మిద ఇలా చేయటం తప్పు..  అన్నారు. 
శ్రీరెడ్డి ట్వీట్ చేయడం వరకు బాగానే ఉంది. కాని ఆమె చేసిన చిన్న పొరపాటు నెటిజన్ల కంటపడింది. ఇక వాళ్లు ఊరుకుంటారా.. ఆమెను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. బుర్ర ఉందా.. లేదా అంటూ ఓ రేంజ్‌లో ఏకిపారేస్తున్నారు.. ఇంతకీ ఆమె చేసిన తప్పేంటనే కదా మీ డౌటు.. ట్వీట్‌లో.. ‘వై ఎస్ జగన్ గారి మీద ప్రతిపక్షాల దాడులు ఏంటి’ అన్నందుకు. జగన్ ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత.. ఆయనపై ప్రతిక్షాలు దాడులు చేయడం ఏంటమ్మా అంటూ టార్గెట్ చేశారు. కొందరు నెటిజన్లైతే.. టీడీపీ వాళ్లు డబ్బులిచ్చి ప్రతిపక్షాలు అని అనమన్నారా? అంటూ మండిపడుతున్నారు. 

Related Posts