YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సీట్ల సర్దుబాటు చర్చలు కొనసాగుతున్నాయ్

సీట్ల సర్దుబాటు చర్చలు కొనసాగుతున్నాయ్

మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగుతున్నాయని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. సీట్ల సర్దుబాటు పూర్తయ్యాక, ఏ పార్టీ.. ఏ స్థానాల్లో బరిలోకి దిగుతుందో అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు. ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, సీపీఐ నేత చాడ వెంకటరెడ్డిలు పాల్గొని సీట్ల సర్దుబాట్లపై చర్చించిన విషయం తెలిసిందే. మహాకూటమిలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ 95 సీట్లలో పోటీ చేయనుండగా, టీడీపీకి 14 స్థానాలు కేటాయించారు. టీజేఎస్, సీపీఐలు పార్టీలు కలిసి 10 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఉత్తమ్ స్పష్టం చేసిన నేపథ్యంలో సీట్ల వివాదంతో పాటు స్థానాల వివాదం మొదలైనట్లు కనిపిస్తోంది. తమకు మరో రెండు సీట్లు కేటాయించాని టీడీపీ, కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. హైదరాబాద్‌లో సెటిలర్లు ఎక్కువగా ఉన్న ఏరియాలలో టీడీపీకి 5 సీట్లను కేటాయించారని, రాష్ట్ర ఇతర ప్రాంతాల్లో 9 స్థానాలు ఇచ్చారని ప్రచారం జరగడం టీడీపీ శ్రేణుల్లో కలవరం రేపుతోంది. కాగా, ఇప్పటివరకూ 14 సీట్లు తమకు కేటాయించిన మాట వాస్తవమేనని, మరిన్ని స్థానాలు ఆశిస్తున్నట్లు రమణ చెబుతున్నారు. సీట్ల సర్దుబాటుతో పాటు పోటీ చేసే స్థానాలపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. వరంగల్ తూర్పు స్థానానికి బదులుగా పరకాల సీటు ఇవ్వాలని రేవూరి ప్రకాష్ రెడ్డి పట్టుబట్టగా, రాజేంద్రనగర్‌కు బదులుగా కంటోన్మెంట్ సీటు తీసుకోవాలని టీడీపీని కాంగ్రెస్ కోరుతోంది. మరోవైపు తమ సీట్లు తేలలేదని టీజేఎస్, సీపీఐలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. త్వరలో పార్టీల సీట్లతో పాటు పోటీ చేసే స్థానాలను అధికారికంగా ప్రకటిస్తామని కూటమి నేతలు చెబుతున్నారు. 
 

Related Posts