YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెరాస-భాజపా కచ్చితంగా కలుస్తాయి - జైపాల్‌రెడ్డి..!!

తెరాస-భాజపా కచ్చితంగా కలుస్తాయి - జైపాల్‌రెడ్డి..!!

 అసెంబ్లీ ఎన్నికల అనంతరం తెరాస-భాజపా కచ్చితంగా చేతులు కలుపుతాయని, ఇందులో ఎలాంటి సందేహం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌ రెడ్డి అన్నారు. తెలంగాణలో డిసెంబరు 7న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రధాన పార్టీలైన తెరాస, కాంగ్రెస్‌, తెదేపా తమ ప్రచారాలను ముమ్మరం చేశాయి. ఈ ఎన్నికల్లో తెరాస ఒంటరిగానే పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్‌ మాత్రం తెదేపా, మరికొన్ని పార్టీలతో కలిసి మహాకూటమిని ఏర్పాటుచేసింది. దిల్లీ నుంచి హైదరాబాద్‌ వరకు గత కొన్ని రోజులుగా ఈ కూటమిపై చర్చలు వాడీవేడీగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జైపాల్‌ రెడ్డి ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

Related Posts