YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

భారత్‌దే టీ20 సిరీస్‌.. వరుసగా ఏడో సిరీస్‌ కైవసం

భారత్‌దే టీ20 సిరీస్‌.. వరుసగా ఏడో సిరీస్‌ కైవసం

కనీస పోటీ లేదు. కాస్తయినా ప్రతిఘటన లేదు. కరీబియన్ల ఆట మరింత పేలవం.  టీ20 సిరీస్‌ కూడా టీమ్‌ఇండియాదే. రోహిత్‌ శర్మ (111 నాటౌట్‌; 61 బంతుల్లో 8×4, 7×6) విధ్వంసక శతకం చేయడంతో మంగళవారం ఏకపక్షంగా సాగిన రెండో టీ20లో భారత్‌ 71 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై ఘనవిజయం సాధించింది రోహిత్‌తో పాటు ధావన్‌ (43; 41 బంతుల్లో 3×4) రాణించడంతో మొదట భారత్‌ 2 వికెట్లకు 195 పరుగులు చేసింది. ఛేదనలో వెస్టిండీస్‌ తేలిపోయింది. 20 ఓవర్లలో 9 వికెట్లకు 124 పరుగులే చేయగలిగింది. చాలా ముందే ఆ జట్టు పరాజయం ఖాయమైంది. డారెన్‌ బ్రావో (23) టాప్‌ స్కోరర్‌. భువనేశ్వర్‌, ఖలీల్‌ అహ్మద్‌, బుమ్రా, కుల్‌దీప్‌ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో విండీస్‌ ఫీల్డింగ్‌ కూడా పేలవం. నామమాత్రమైన మూడో టీ20 11న చెన్నైలో జరుగుతుంది.   రోహిత్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

Related Posts