YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నసోనియా గాంధీ

రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నసోనియా గాంధీ
ఈనెల19 తర్వాత సోనియా గాంధీ తెలంగాణలో పర్యటించబోతున్నారు. రెండు రోజుల పాటు సోనియా గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. తెలంగాణలో ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి ప్రజాకూటమి పేరుతో నాలుగు పార్టీలు తెలంగాణలో టీఆర్ఎస్‌ను ఎదుర్కోనున్నాయి. ఈ క్రమంలో యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీతో రాష్ట్రంలో వీలైనన్ని ఎక్కువ సభలు నిర్వహించేలా ఆ పార్టీ నేతలు యోచిస్తున్నారు. ఈనెల 19 నాటికి అభ్యర్థుల వివరాలు వెల్లడికానున్న నేపథ్యంలో జాతీయ నాయకులతో పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ అధినాయకత్వం షెడ్యూల్‌‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా సోనియా గాంధీతో రెండు దఫాలుగా తెలంగాణలో ప్రచారం నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.19వ తేదీ అనంతరం ఉత్తర తెలంగాణలో రెండు రోజులు, దక్షిణ తెలంగాణలో రెండు రోజుల పాటు సోనియా గాంధీతో ఏడెనిమిది నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహించాలని పార్టీ భావిస్తోంది. ఇప్పటికే సోనియా గాంధీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. సోనియా తర్వాత పార్టీ అధినేత రాహుల్ గాంధీ కూడా తెలంగాణలో పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు జాతీయ స్థాయి నాయకులతో కూడా సభలు, సమావేశాలు నిర్వహించాలని పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో వంటేరు ప్రతాప్‌రెడ్డి మహాకూటమి అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. దీంతో గట్టి నెలకొంటుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో, నియా గాంధీతో అక్కడ సభకు ఏర్పాట్లు చేస్తే దాని ప్రభావం ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఉమ్మడి మెదక్ జిల్లాపై ఉంటుందని రాహుల్‌తో ఆ పార్టీ నేతలు చెప్పినట్లు తెలుస్తోంది. సోనియా గాంధీ సభ గజ్వేల్‌ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

Related Posts