YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ముష్టి మూడు సీట్ల కోసం రాహుల్ చుట్టు పొర్లు దండాలు పెడుతున్నారు మంత్రి కేటీఆర్ ఎద్దేవ

ముష్టి మూడు సీట్ల కోసం రాహుల్ చుట్టు పొర్లు దండాలు పెడుతున్నారు                          మంత్రి కేటీఆర్ ఎద్దేవ
ముష్టి మూడు సీట్ల కోసం రాహుల్ గాంధీ చుట్టు పొర్లు దండాలు పెడుతున్నారని మంత్రి కేటీఆర్ దుయ్యబట్టారు. దొంగలు దొంగలు ఒక్కటయ్యారని  కాంగ్రెస్, టీడీపీని ఉద్దేశించి అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన రైతు కృతజ్ఞతా సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్... గత ప్రభుత్వాలు రైతులను నిర్లక్ష్యం చేశాయన్నారు. విత్తనాల కోసం, ఎరువుల కోసం రైతులు ఎంతో ఇబ్బందులు పడ్డారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులను చిన్నచూపు చూశారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 24గంటల కరెంట్ ఇస్తున్నామని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి అని మంత్రి అన్నారు. ఇప్పటి వరకు 17వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశామన్నారు.సిరిసిల్ల నియోజకవర్గంలో లక్షా 10వేల ఎకరాలకు నీరు అందిస్తామని మంత్రి తెలియజేశారు. వీర్నపల్లి,ముస్తాబాద్ మండలంలో 120కోట్ల రూపాయలతో చెరువులు నింపుతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. జిల్లాలో 260 కుంటలు,చెరువులు నింపుతామన్నారు. ముఖ్యమంత్రులు ఎందరు వచ్చినా రైతుల రాతలు మారలేదన్న మంత్రి.. రైతులకు డబ్బులు ఇచ్చిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు.రైతు బీమా రైతు కుటుంబానికి ధీమా, దేశంలో తెలంగాణలో తప్ప ఎక్కడా లేదు. ప్రాజెక్టులపై కాంగ్రెస్ వాళ్లు దొంగ కేసులు వేస్తూ అడ్డుకుంటున్నారు. చంద్రబాబు కూటమికి ఓటు వేసి మన జుట్టు చంద్రబాబు చేతిలో పెడదామా . 453 పథకాలు తెలంగాణ ప్రజల కోసం చేపట్టాం. కలిసి కూర్చొని సీట్లు పంచుకునే దమ్ము లేదు గానీ.. రేపు కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తారటని ఎద్దేవ చేసారు.సోనియా గాంధీని చంద్రబాబు ఎన్నో తిట్లు తిట్టాడు. కానీ మళ్లీ కాంగ్రెస్ వాళ్లు చంద్రబాబుతో జతకట్టారు. వచ్చే ఎన్నికలు తెలంగాణ రైతులు తమ రాతలు తామే రాసుకునే ఎన్నికలు.. ఆలోచించి ఓటు వేయండి. తెలంగాణ అంటేనే పోరాటల గడ్డ. ఆ గడ్డ పవర్‌ను మీ ఓటుతో చూపించండి.." అంటూ మంత్రి వెల్లడించారు.

Related Posts