YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నామినేషన్లు వేసిన బిజెపి లక్ష్మణ్‌, రాజాసింగ్‌

నామినేషన్లు వేసిన బిజెపి లక్ష్మణ్‌, రాజాసింగ్‌
తెలంగాణ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. తొలి రోజే పలువురు భాజపా అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ముషీరాబాద్‌ అభ్యర్థిగా లక్ష్మణ్‌ నామినేషన్‌వేశారు. కేంద్రమంత్రి హన్ష్‌రాజ్‌ తాహిర్‌, ఎంపీ దత్తాత్రేయ, కిషన్‌ రెడ్డితో కలిసి ఆయన నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని విజయ గణపతి ఆలయంలో పూజలు చేసి అక్కడి నుంచి కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి తహసీల్దార్‌కు తన నామినేషన్‌ పత్రాలను అందజేశారు. గోషామహల్‌ భాజపా అభ్యర్థి రాజాసింగ్‌ ఆకాశ్‌పురి హనుమాన్‌ దేవాలయం నుంచి ర్యాలీగా వెళ్లి అబిడ్స్‌లోని జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో నామినేషన్‌ వేశారు. నల్గొండ జిల్లా మునుగోడు అభ్యర్థిగా గంగిడి మనోహర్‌ రెడ్డి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. వరంగల్‌ గ్రామీణ జిల్లా పరకాలలో భాజపా అభ్యర్థి విజయ చందర్‌ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు.

Related Posts