YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఉమ్మడి అజెండా సిద్దం చేస్తామంటున్న నేతలు

ఉమ్మడి అజెండా సిద్దం చేస్తామంటున్న నేతలు
ఉమ్మడి ఎన్నికల ప్రణాళికతో ప్రజల ముందుకు వస్తోంది తెలంగాణ మహా కూటమి. సోమవారం ఉదయం కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మల్లు భట్టి విక్రమార్క ఇంట్లో సమావేశమైన నేతలు.. అజెండాతో మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై చర్చించారు. కూటమి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైతే.. చేయాల్సిన పనులపై ఫోకస్ పెట్టారు. ఈ భేటీలో టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, టీజేఎస్ అధినేత కోదండరాంతో పాటూ టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. 
ప్రజాకూటమిగా తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు భట్టి విక్రమార్క. కలిసొచ్చే అన్ని పార్టీలు తమకు ముసాయిదా అందజేశాయని.. మంగళవారం మరోసారి సమావేశమై భాగస్వామ్య పార్టీలతో చర్చిస్తామన్నారు. అన్ని వర్గాలకు ముసాయిదాలో చోటు కల్పించామని.. ఉమ్మడి ప్రణాళికలోని అంశాలే ఎన్నికల ప్రచార అంశాలని వ్యాఖ్యానించారు భట్టి. తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో.. ప్రజలంతా ఓవైపు ఉంటే.. కేసీఆర్ కుటుంబం మొత్తం మరోవైపు ఉందన్నారు కోదండరాం. కూటమికి సంబంధించిన ఉమ్మడి ప్రణాళిక అజెండా సిద్ధమైనందని.. భాగస్వామ్య పార్టీలు ముసాయిదాకు అంగీకరించాయన్నారు. మంగళవారం మరోసారి చర్చించాక విడుదల చేస్తామని తెలిపారు. కోదండరాం. సామాన్యుల అజెండాను కాంగ్రెస్ పార్టీకి అందించామని.. అమరులు, ప్రజల పక్షాన ఉమ్మడి అజెండా ఉంటుందని టీడీపీ నేత రావుల అన్నారు. 

Related Posts