YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఇంకా 53 సభ్యులపై రాని క్లారిటీ

 ఇంకా 53 సభ్యులపై రాని క్లారిటీ
బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం మళ్లీ వాయిదా పడింది. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం  జరగాల్సి ఉంది. అయితే కొందరు సభ్యులు అందుబాటులో లేక పోవడంతో వాయిదా పడింది. ఇప్పటికే విడుదల రెండు జాబితాల్లో 66 మందికి టికెట్లు ఇచ్చింది. మిగిలిన 53 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ సమావేశంలో అన్ని స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తామని బీజేపీ నేతలు చెబతున్నార కాగా ఎన్నికల కమిటీ సమావేశం వాయిదా పడడానికి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా కూటమి అభ్యర్థులను ఎంపిక చేయకపోవడమే కారణమని తెలుస్తోంది. ప్రజా కూటమి అభ్యర్థుల ఎంపిక జరిగిన తరువాత కాంగ్రెస్‌కు చెందిన అసంతృప్త నేతలు బీజేపీవైపునకు చూసే అవకాశముందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అలాంటివారిలో ప్రముఖ నేతలకు బీజేపీ తరుపున టికెట్లు ఇచ్చే అవకాశముంది. అందుకే తుది జాబితా విషయంలో బీజేపీ జాప్యం చేస్తోందని ప్రచారం జరుగుతోంది.=

Related Posts