YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఘనంగా పుష్పయాగం

 ఘనంగా పుష్పయాగం
తిరుమలలో శ్రీవారి పుష్పయాగం అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. బ్రహ్మోత్సవాలు పూర్తి అయిన నెల తరువాత అలంకార ప్రియునికి ఈ వార్షిక ఉత్సవమైన పుష్పయాగాన్ని నిర్వహిస్తారు. . పవిత్ర కార్తీక మాసంలో శ్రీవారికి నిర్వహించే పవిత్ర ఉత్సవం పుష్పయాగ మహోత్సవం. ఈ ఉత్సవానికి ముందుగా 9 టన్నుల  18 రకాల పుష్పలను ఉద్యాన వాన కార్యాలయం నుంచి శ్రీవారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు.  ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున  టీటీడీ ఉద్యోగులు,  శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. ఈ పుష్పాలను ముందుగా  టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ కు అందచేసారు.  అనంతరం మధ్యాహ్నం 1 గంటకు మొదయిన పుష్పయాగం మహోత్సవంలో ఈ పుష్పలను శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారిపై అర్చన చేసారు. 

Related Posts