తిరుమలలో శ్రీవారి పుష్పయాగం అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. బ్రహ్మోత్సవాలు పూర్తి అయిన నెల తరువాత అలంకార ప్రియునికి ఈ వార్షిక ఉత్సవమైన పుష్పయాగాన్ని నిర్వహిస్తారు. . పవిత్ర కార్తీక మాసంలో శ్రీవారికి నిర్వహించే పవిత్ర ఉత్సవం పుష్పయాగ మహోత్సవం. ఈ ఉత్సవానికి ముందుగా 9 టన్నుల 18 రకాల పుష్పలను ఉద్యాన వాన కార్యాలయం నుంచి శ్రీవారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీటీడీ ఉద్యోగులు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. ఈ పుష్పాలను ముందుగా టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ కు అందచేసారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు మొదయిన పుష్పయాగం మహోత్సవంలో ఈ పుష్పలను శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారిపై అర్చన చేసారు.