YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాంగ్రెస్ కు కార్తీక్ రెడ్డి రాజీనామా

కాంగ్రెస్ కు కార్తీక్ రెడ్డి రాజీనామా
కాంగ్రెస్ పార్టీకి మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన ఆశించిన రాజేంద్రనగర్ సీటు దక్కకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తనకు మద్ధతుగా ఎంపీపీలు, జడ్పీటీసీలు, డివిజన్ అధ్యక్షులు కూడా పార్టీకి రాజీనామా చేస్తారని ప్రకటించారు. మహాకూటమి నుంచి ఎల్.రమణ టికెట్లు అమ్ముకున్నారని కార్తీక్రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పొత్తుల్లో భాగంగా రాజేంద్రనగర్ సీటును టీడీపీకి కేటాయించిన సంగతి తెలిసిందే. మహాకూటమి అభ్యర్థిగా రాజేంద్రనగర్ నుంచి గణేష్ గుప్తాకు టికెట్ లభించింది. అయితే తాను ఎప్పటి నుంచి రాజేంద్రనగర్ నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నానని, తన అభ్యర్థిత్వం గురించి పరిశీలించాలని పార్టీకి కార్తీక్ రెడ్డి పలుమార్లు విన్నవించుకున్నారు. అయినప్పటికీ టికెట్ దక్కకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.  కార్తీక్ రెడ్డి రాజీనామాతో తల్లి సబితా ఇంద్రారెడ్డి ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారో అని కాంగ్రెస్ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి పోటీపడుతున్న సబిత కుటుంబం నుంచే ఇలాంటి పరిణామాలను ఎదుర్కోవడం పార్టీకి షాక్ కలిగించింది. రాజేంద్రనగర్ నుంచే ఇండిపెండెంట్ గా పోటీచేసి గెలిచి.. తన సత్తా చాటాలని కార్తీక్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం.

Related Posts