YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణ ద్రోహి చంద్రబాబు... డిప్యూటీ సీఎం మహమూద్ అలీ

తెలంగాణ ద్రోహి చంద్రబాబు...  డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం లో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పర్యటీంచారు. కొత్తూరు మండలం లో jp దర్గా లో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం ఇన్ ములనర్వ  గ్రామంలో తెరాస పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. వివిధ పార్టీల నుండి తెరాస పార్టీ లో చేరిన సుమారు 100 మందికి కండువాలు కప్పి ఆహ్వానించారు. 
        అనంతరం ఆయన  విద్యార్థుల బలిదానాలు ఆపడానికి  కేసీఆర్  చేసిన కృషి వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు. అభివృద్ధి జరగాలంటే తెరస పార్టీ ని మరోసారి గెలిపించాలన్నారు. ప్రజలు తెరాస  వైపే ఉన్నారన్నారు. కూటమిగా పేరుతో ఓట్లు అడిగే వారిని గ్రామాల్లో తిరగనియొద్దన్నారు. తెలంగాణ ద్రోహి చంద్రబాబు అని, ప్రాజెక్టు లను ఆపేటందుకు ఎన్ని కేసులు వేశాడో ప్రజలందరికీ తెలుసున్నాడు. షాద్ నగర్ తెరాస అభ్యర్థి అంజయ్య యాదవ్ ని గెలిపించాలని ప్రజలను కోరారు.

Related Posts