ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రంగంబంజార్ గ్రామంలో మహాకూటమి ఆధ్వర్యంలో తాజా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మిషన్ భగీరధ ద్వారా కోట్ల రూపాయలు వృధా చేసారని అన్నారు. నీళ్లు ఇవ్వకుండా ఓట్లు అడగమని ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నాసిరకంగా కట్టారని కొన్నిచోట్ల స్తంభాలు కూలిపోవడం, ఇల్లు కురవడం జరిగిందని తెలిపారు. ప్రజాకుటమి ప్రభుత్వం లో ఆ బాధ ఉండదని అన్ఆరు. మీ స్థలంలో ఐదు5 లక్షలతో మీరే కట్టుకోవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు రాయల శేషగిరిరావు, దుపాటి భద్రరాజు,ధారా బాబు,లచ్చిరెడ్డి, రామకృష్ణ,శివ,కాటంనేని వెంకటేశ్వరరావు, ప్రసాద్,కొత్తపల్లి వెంకటేశ్వర్లు గద్దల శంకర్ మహాకూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.