యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ లో రాజకీయ పార్టీల ప్రచారం వినూత్నంగా మారుతోంది. టిఆర్ ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత చేస్తున్న ప్రచారం రోజురోజుకు జోరు అందుకుంటుంది. నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లిన ఓటర్లును కలుసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ చేసిన సంక్షేమ పథకాలను ఓటర్లు గుర్తుచేస్తూ ఆకట్టుకుంటున్నారు. బీడీలు తయారుచేస్తున్న మహిళల వద్దకు వెళ్లి బీడీలు చుడుతూ మహిళలను తనకు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని వేడుకున్నారు అంతేకాకుండా హోటల్ వద్దకు వెళ్లి పూరీలు చేస్తూ ఓటర్లను అబ్బురపరిచారు. కాంగ్రెస్ అభ్యర్ధి బుడిద బిక్షమయ్య ప్రచారం కుడా జోరుగా సాగుతోంది. అయన గీత కార్మికుల వద్దకు వెళ్లి కల్లు పోస్తూ హోటల్ లో టీ అమ్ముతూ, దోశలు వేస్తూ వెరైటీ ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేసి తనను గెలిపించాలని వాగ్దానాలు తీసుకుంటున్నారు. బి ఎల్ ఎఫ్ అభ్యర్థి గా మోత్కుపల్లి నర్సింహులు కూడా ఓట్ల కోసం వెరైటీ వైరటీ ప్రచారం చేస్తున్నారు. హోటల్ లో టీ అమ్ముతూ, బార్బర్ షాప్లో కటింగ్ చేస్తూ, చెప్పులు కుడుతూ ఓటర్లనీ ఆకట్టుకోవడానికి వినూత్నమైన రీతిలో ప్రచారం చేస్తున్నారు.