YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రహదారులపై సీఎం సమీక్ష

రహదారులపై సీఎం సమీక్ష
ఆర్అండ్ బీ శాఖ ప్రాజెక్టుల పురోగతి, పనితీరుపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఆర్అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాజెక్టులు పనితీరు ఎలా ఉందనే అంశంపై చర్చించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ  రహదారులు సుందరంగా ఉండాలన్నారు. అలాగే సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజల్లో రహదారుల పరిస్థితిపై సంతృప్తి రావటం ముఖ్యం అన్నారు  రహదారులపై గతుకులు, గుంతలున్నా ఉపేక్షించనన్నారు. సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రహదారులు పాడవడంపై శాస్త్రీయ అధ్యయనం చేసి పరిష్కారాలు కనుగొనాలన్నారు.  సీసీ కెమెరాలు అమర్చాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. హైవేల్లో వచ్చే వాహనాలు, వెళ్లే వాహనాల సంఖ్య నమోదు చేయాలని ఆదేశించారు. అన్నారు. అలాగే రహదారులపై రద్దీకి అనుగుణంగా రోడ్లు ఆ రద్దీని తట్టుకునే సామర్ధ్యంతో మరమ్మతులు చేయవచ్చని అన్నారు. 

Related Posts