YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ కు నటరత్న అవార్డు ఇవ్వొచ్చు

జగన్ కు నటరత్న అవార్డు ఇవ్వొచ్చు
అట్టర్ ఫ్లాప్ డ్రామాలు, చెత్త నటనకు అవార్డులుంటే.. వైసీపీ అధినేత జగన్‌కే మొత్తం అవార్డులు వస్తాయంటున్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. వరుసగా మూడు డ్రామాలు ఫెయిలైనా.. నటన మాత్రం ఏమాత్రం తగ్గడం లేదంటూ పంచ్‌లు పేల్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా.. విజయనగరం జిల్లా కురుపాంలో జరిగిన బహిరంగ సభలో జగన్ చేసిన విమర్శలకు.. ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ట్వీట్‌లో.. జగన్ మోహన్ రెడ్డి గారు ముందు 108 డ్రామా.. ఆ వెంటనే మళ్లీ కోడికత్తి డ్రామాలాడారు. ఇప్పుడు కొత్తగా ఆవు డ్రామా ఆడుతున్నారు. ఒకవేళ చెత్త నటనకు.. అట్టర్ ఫ్లాప్ డ్రామాలకు అవార్డులంటూ ఉంటే.. జగన్‌ అన్ని దక్కించుకుంటారు. కాని ఈసారికి మాత్రం చెత్త నటనకు భాస్కర్ అవార్డుతో గౌరవించుకుందాం అంటూ సెటైర్లు పేల్చారు. అలాగే ఓ వీడియోను కూడా ట్వీట్ చేశారు మంత్రి. రెండు రోజుల క్రితం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా.. విజయనగరం జిల్లా కురుపాంలో బహిరంగ సభ జరిగింది. ఈ సభలో జగన్ ప్రసంగిస్తుండగా.. ఓ ఆవు జనాల్లోకి దూసుకొచ్చింది. దీనిపై స్పందించిన జగన్.. ఆవుకు దూరంగా జరగమని పార్టీ శ్రేణుల్ని కోరారు. తర్వాత మీటింగ్ జరుగుతుంటే ఆవుల్ని పంపిస్తున్న తెలుగు దేశం వాళ్లు మనుషులేనా అంటూ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపైనే లోకేష్ స్పందించారు. అంతక మందు కూడా.. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో జరిగి బ‌హిరంగ స‌భ స‌మ‌యంలో ఓ మ‌హిళ ప్ర‌స‌వం కోసం ఆటోలో వెళ్తూ స‌భా వ‌ద్ద‌కు వ‌చ్చి దారి ఇవ్వ‌మ‌ని బంధువులు కోరారు. ఆ స‌మ‌యంలో జ‌గ‌న్ ఆటో కు దారి ఇవ్వ‌మ‌ని స‌భ‌కు హాజ‌రైన పార్టీ శ్రేణులకు సూచిస్తూనే.. ప్ర‌భుత్వం 108 వ్య‌వ‌స్థ‌ను నిర్వీర్యం చేసింద‌ని విమ‌ర్శించారు. తర్వాత మరో సభ జరుగుతుండగా.. 108 అటువైపుగా రావడంతో.. టీడీపీ నేతలు కుట్రలు చేస్తూ.. ఉద్దేశపూర్వకంగా వాహనాన్ని సభవైపుగా పంపారని ఆరోపించారు. దీనికి మంత్రులు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఆ వాహనంలో ఆస్పత్రికి వెళ్లిన పేషెంట్ ఆధారాలతో సహా మీడియా ముందు ఉంచారు.

Related Posts