దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పెట్రేగిపోతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవలె ప్రజా పోరాటయాత్ర చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎల్లూరు సభలో చింతమనేని ప్రవర్తన ఫై మండిపడ్డారు. తాజాగా సినీ నటి అపూర్వ ఒక ఇంటర్వ్యూలో దెందులూరు నియోజవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అతను చేస్తున్న అన్యాయాలను, దౌర్జన్యాలను ఆమె చెప్పారు. అటువంటి వారికీ చంద్రబాబు ఎమ్మెల్యే టిక్కెట్లు ఎందుకు ఇస్తున్నారని వాపోయారు. అతనే కానీ మళ్ళి ఎమ్మెల్యే అయితే దెందులూరులో తమ ఆస్తులని అమ్ముకుని తెలంగాణకి వెళ్ళిపోతాం అని ఆవిడ అన్నారు. చింతమనేని ప్రభాకర్ కు ఇవేమి కొత్త కాదు మూడు నెలల క్రితం దెందులూరుకు చెందిన దివ్యాంగుడు, అతని తల్లితండ్రులపై దాడి.. రెండున్నర నెలల క్రితం దళిత కార్మికుడు జాన్పై దాడి ఇలా అయన కోసం చెపుకుంటా పోతే ఒకటి కాదు ఎన్నో ఉన్నాయి. అయన ఎన్నో కేసులులలో ప్రధాన నిందుతుడిగా ఉన్నాడు. మరి తమ పార్టీ ఎమ్మెల్యే చేసే అరాచకాలు ఫై చంద్రబాబు నోరు మెదపాటలేదు.