YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సింఘాల్ స్టైలే వేరు...

సింఘాల్ స్టైలే వేరు...
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కేంద్ర మంత్రికే షాక్ ఇచ్చారు. నిబంధనలు ప్రకారం నడుచుకోకపొతే, ఎవరైనా ఒకటే అనే సందేశం ఇచ్చారు. టిటిడి ఉద్యోగులకి ఇబ్బంది అయినా, ఈ నిర్ణయం తీసుకోక తప్పదు అని తేల్చి చెప్పారు. జరిగిన విషయం తెలుసుకుని ఆ కేంద్ర మంత్రి కూడా షాక్ కు గురయ్యారు. నా సిఫారుసు పక్కన పడేస్తారా, మీ సియం చెప్పినట్టు ఆడతారా, ప్రధాని మోడీకి కంప్లైంట్ చేస్తాను అంటూ, ఆ మంత్రి ఊగిపోయినట్టు  సమాచారం. తిరుమలలో ఉద్యోగ బదిలీ కోసం ఓ కేంద్ర మంత్రి చేత సిఫార్సు చేయించుకున్న ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు వేశారు. నిబంధనలకు విరుద్దంగా సిఫార్సులు ఇప్పించడంతోనే ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. సింఘాల్ చర్యతో టీటీడీ ఉద్యోగుల్లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. టీటీడీలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న యువరాజు తిరుమలలో విధులు నిర్వర్తించాలని కోరుకున్నాడు. ఈ నేపథ్యంలో ఓ కేంద్ర మంత్రి చేత సిఫార్సు చేయించుకున్నాడు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా పరిగణించిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్.. యువరాజ్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారువిరుద్ధంగా సిఫార్సులు చేయించడంతోనే ఈ చర్యలు తీసుకున్నట్లు సింఘాల్ స్పష్టం చేశారు. మరోవైపు ఈవో చర్య పై టీటీడీ ఉద్యోగులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బదిలీలకు చాలామంది ఉద్యోగులు మంత్రుల ద్వారా సిఫార్సులు చేయిస్తూ ఉంటారనీ, కుటుంబం, ఇతర సమస్యల కారణంగా ఇలాంటి విజ్ఞప్తులు చేస్తుంటారని తెలిపారు. ఇలా ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేయడం ఎంతమాత్రం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. అయితే సింఘాల్ మాత్రం, నా హయంలో, ఇలాంటివి జరగటానికి వీలు లేదని, నేను రూల్ ప్రకారం నడుచుకుంటానని చెప్తున్నారు.

Related Posts