సినీ నటులు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, అల్లు అర్జున్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూలైన్లో నిలబడి మరి తమ ఓటును వినియోగించుకున్నారు. నాగార్జున తన భార్య అమలతో కలిసి ఓటు వేశారు. చిరంజీవి కూడా తమ భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన కుటుంబ సభ్యులందరూ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, అయితే, రామ్చరణ్ విదేశాలకు వెళ్లడంతో ఓటు వేసే అవకాశాన్ని కోల్పోయాడని అన్నారు.