YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆటలు

7వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసిన టీమిండియా

 7వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసిన టీమిండియా

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 5వ వన్డేలో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 7వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. టీమిండియా బ్యాట్స్‌మెన్స్‌లో రోహిత్ శర్మ 115 పరుగులతో సెంచరీ చేసి రాణించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన ధావన్ 34 పరుగులు చేశాడు. 8 ఫోర్లు చేసి దూకుడుగా ఆడుతున్న ధావన్‌ను రబడ ఔట్ చేశాడు. ధావన్ ఔట్ తర్వాత క్రీజులోకొచ్చిన కోహ్లీ 36పరుగులు చేశాడు. డుమ్నీ బౌలింగ్‌లో రనౌట్‌గా వెనుదిరిగాడు. రహానే కూడా రనౌట్ అయ్యాడు. శ్రేయాస్ అయ్యర్, హార్థిక్ పాండ్యా, ధోనీ కూడా దక్షిణాఫ్రికా బౌలర్ లుంగీ ఎన్‌గిడి ధాటికి ఔట్ కాక తప్పలేదు. హార్థిక్ పాండ్యా డకౌట్ అవడం అభిమానులను నిరాశపరిచింది. మ్యాచ్ ముగిసే సమయానికి భువనేశ్వర్ కుమార్(19), కుల్‌దీప్ యాదవ్(2) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

Related Posts