కొత్తగా కొలువుదీరే తానే సీనియర్ ఎమ్మెల్యేనని కేసీఆర్ చెప్పారు. తన తర్వాత రెడ్యా నాయక్, ఎర్రబెల్లి దయాకర్రావు సీనియర్లు అని తెలిపారు. లెక్క ప్రకారం 95 నుంచి 106 సీట్లు తాము గెలవాల్సి ఉంది. ఖమ్మంలో తమ పార్టీ అంతర్గత విబేధాల వల్లే ఓడిపోయామని పేర్కొన్నారు. గెలిచిన వాళ్లే కాదు.. గెలవని వాళ్లు కూడా తనకు ముఖ్యమేనని స్పష్టం చేశారు. గెలవని వాళ్లను కూడా కలవాలి.. వాళ్లతో మాట్లాడాలి అని కేసీఆర్ చెప్పారు. తమ పార్టీలో ఇంకా చాలా మంది చేరబోతున్నారని కేసీఆర్ పేర్కొన్నారు.