ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్న నేపథ్యంలో సోమవారం ఉదయం, సాయంత్రం చలిగాలులతో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి పంజాతో నగరానికి వణుకు పుడుతోంది. శివారు ప్రాంతాల్లో పగటిపూట సైతం చలిమంట వేసుకున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.నగరం కాశ్మీర్ను తలపించింది. చల్ల ని వాతావరణంతో వేడివేడి కాఫీలు, మొక్క జొన్న కంకులు, మిర్చీ బజ్జీలు వెంటవెం టనే అమ్ముడయ్యాయి. ఫేమస్ స్పాట్లలో జనం క్యూ కట్టారు. పెథారు తుఫాను ప్రభావం తో ఉదయం 8 గంటల వరకూ సూర్యక్రాం తి బయటికి రాలేదు. చలి తీవ్రత తట్టుకోలేక జనం ఉదయం చలి మంటలు కాపుతున్నా రు. నిత్యం రద్దీగా ఉండే బంజారాహిల్స్ ప్రాం తంలోని కేబీఆర్ జాతీయ పార్కులో జనసం చారం కరువైంది. చాలా చోట్ల స్వెట్టర్ వేసుకుని, ఉన్ని దుస్తులు ధరించి కన్పించా రు. చలితీవ్రత ఉద్యోగస్తు లపైనా తీవ్ర ప్రభావం చూపింది. కొందరు డ్యూటీలకు సెలవు పెట్టేసి బయటికి వెళ్లలేని పరిస్థితిలో ఇంట్లోనే ఉండిపోయారు. శివారు ప్రాంతాల్లో చలి ప్రభావం మరీ తీవ్రంగా కన్పించింది. ఎక్కడపడితే అక్కడ చలిమంటలు వేసుకుని చలికాగా రు. స్కూల్కు, కాలేజీకి వెళ్లే విద్యార్థులు చలికి తట్టుకోలేకపోయారు.