ముఖ్య మంత్రి కేసిఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తిఅరేస్ పార్టీ ని గెలిపించాయని సికింద్రాబాద్ శాసన సబ్యులు,మాజీ మంత్రి టి.పద్మారావు గౌడ్ అన్నారు.మంగళవారం సుసున్దేరాబాద్ కు చెందిన సీనియర్ టిఆర్ఎస్ నాయకులు యాదగిరి ముదిరాజ్, సాంబ యాదవ్,ఆంజనేలు ముదిరాజ్ (అంజూర్), మహిళా నాయకురాలు నిర్మల ముదిరాజ్, సాయి, తదితరులు పద్మా రావు నివాసం లో కలిసి గజ మాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా పద్మా రావు మాట్లాడుతూ తనగేలుపుకు టిఆర్ఎస్ కార్యకర్తల కృషి, పట్టుదలే కారణమన్నారు.తాను నియోజక వర్గం లో పూర్తి స్థాయి లో తిరుగాకున్న కార్య కరతలే తననుగా బావించి ఇంటింటికీ తిరిగి ప్రచారాన్ని నిర్వహించి తన గెలుపుకు కృషి చేసారని అన్నారు.వారి శ్రమను,పడిన కష్టాన్ని తనేన్నడు మరిచి పోలేనన్నారు.తనకు ఓట్లు వేసి అఖండ గెలుపుకు తోడ్పడిన సికింద్రాబాద్ ప్రజలందరికీ పద్మా రావు పేరు పేరున కృతఙ్ఞతలు తెలిపారు.ముఖ్యంగా నిర్మలవంటి మహిళా నాయకురాళ్ళు తన గెలుపు కోసం ఎంతో కృషి చేసారని వారికి వ్రుదయపుర్వకంగా అభినందనలు తెలిపారు.ఎల్లవేలల ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్బంగా పద్మా రావు హామీ ఇచ్చారు.