YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెరాస మరింత బలోపేతం

తెరాస మరింత బలోపేతం
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శం. శ్రేయో రాజ్యం, సంక్షేమ రాజ్యం మనది.  దేశ ప్రజల మన్ననలు పొందిన రాష్ట్రం మనదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం నాడు అయన కరీంనగర్ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ లో మీడియాతో మాట్లాడారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు, జెడ్పీ చైర్మన్ తుల ఉమ, మేయర్  రవీందర్ సింగ్ పాల్గన్నారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్ని చిల్లర ఆరోపణలు చేసినా కెసిఆర్ గారి నాయకత్వం లో మరో సారి ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నాం. మహా కూటమి రూపంలో కాలకూట విషాలు చిమ్మి, ఆంధ్ర మీడియా కుయుక్తులు ఎన్ని ఉన్నా ప్రజలు తెరాస కి పట్టం గట్టారు. 13 సీట్లకు 12 సీట్లు గెలిపించిన కరీంనగర్ జిల్లా ప్రజలకు ధన్యవాదాలని అన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా మీకు అండగా ఉంన్నాం..మళ్లీ ఉంటాం.  కరీంనగర్ రైస్ బౌల్ గా, సీడ్ బౌల్ గా పేరు తెచ్చుకున్న జిల్లా.. భవిష్యత్తులో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పుతామని హామీ ఇస్తున్నాం.  స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి.. అంకిత భావంతో పనిచేసిన లీడర్స్ కి అవకాశం ఇస్తాం. ద్రోహం చేసే వారికి ఛాన్స్ ఇవ్వమని అయన అన్నారు. ప్రజలు కూడా ఎవరు మేలు చేస్తారో చూసి ఓటు వేయండి. ఎన్నికలు అనగానే డబ్బులు , మద్యం అనే ఒరవడి ప్రజాస్వామ్యానికి, ప్రజలకు మంచిది కాదు. వాటి కోసం కాకుండా ధర్మం వైపు ఉండండి.  పార్టీ కి ద్రోహం చేసిన వారిని ఉపేక్షించేది లేదు. అందరి గురించి రిపోర్ట్ ఉంది. పార్టీకి నష్టం చేసిన వారిని వదిలిపెట్టం. కేటీఆర్ నాయకత్వం లో పార్టీ ని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్న. ఏ పార్టీకి ఇక్కడ సూది మొన మోపే అవకాశం లేకుండా పార్టీని బలోపేతం చేస్తాం. దేశంలో అత్యధిక సభ్యత్వాలు కలిగిన పార్టీ తెరాస. బలోపేతానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.. 

Related Posts