YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు ఇప్పట్లో సాధ్యం కాదు

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు ఇప్పట్లో సాధ్యం కాదు
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు ఇప్పట్లో సాధ్యం కాదని కేంద్రం మరోసారి స్పష్టంచేసింది. రాజ్యాంగంలోని 170 (3)వ అధికరణం ప్రకారం 2026 తర్వాత సేకరించే తొలి జనాభా లెక్కల ప్రకారమే అసెంబ్లీ సీట్ల పెంపు ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు రాజ్యసభలో ఎంపీ సుజనాచౌదరి అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయ మంత్రి హన్స్ రాజ్ గంగారం లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.రాష్ట్ర విభజన తర్వాత అసెంబ్లీ స్థానాల పెంచాలని విభజన చట్టంలో పేర్కొన్నారు. ఏపీలో 175 నుంచి 225కు, 119 నుంచి 153కు పెంచాలని పొందుపరిచారు. మరోవైపు విభజన చట్టంలోని 12వ షెడ్యూల్ అంశాలన్నీ దాదాపు అమలులోకి తెచ్చామని కేంద్రం స్పష్టంచేసింది. ఈ మేరకు మరో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది.

Related Posts