దేశంలోనే మొదటి స్థానంలో లక్ష మెజారిటీతో గెలిపించినందుకు చాలా సంతోషం. ఈ ఘనత సిద్దిపేట ప్రజలది, కార్యకర్తలది. ఎన్ని జన్మలెత్తినా సిద్దిపేట ప్రజల రుణం తీర్చలేనిదని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. బుధవారం అయన మీడియాతో మట్లాడారు. ఎవరైనా మంచి నాయకుడు ఉన్నారనుకుంటారు, కానీ నాకు మంచి ప్రజలు దొరికారనిపిస్తుంది. - నా చర్మం వలిచి చెప్పులు కుట్టించినా తక్కువే. ఈ జన్మ ఉన్నంత వరకు మీ కోసం పని చేస్తానని అన్నారు. మీ ఆశీస్సులతో మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. - నాడు ఎన్నికల వల్ల ఆగిపోయిన బతుకమ్మ చీరలు ఇప్పుడు పంపిణీ చేస్తున్నాం. నా మీద అభిమానం ఉన్న వాళ్ళు బోకేలు, శాలువాలు తేకుండా చెట్టు ను పెంచండని సూచించారు. మీరు మా మీద నమ్మకం ఉంచి, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు అంతే నమ్మకంతో అభివృద్ధి చేస్తామని అయన అన్నారు.